జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల బడ్జెట్ అంశాలపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లతో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొత్తం బడ్జెట్లో కనీసం 10 శాతం గ్రీన్ బడ్జెట్కు కేటాయించాలని, అభివృద్ధి పనులు, నిర్వహణ ఖర్చులు, వేతనాలు తదితర అంశాలకు సమతుల్యంగా నిధులు కేటాయించాలని సూచించారు.
అలాగే ప్రతి పురపాలక సంఘంలో కౌన్సిల్ను సంప్రదించి బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, వాటి నివేదికలను ఉన్నతాధికారులకు పంపాలని కమిషనర్లను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి