Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

ప్రతి సంవత్సరం భక్తులను ఆకర్షించే మాఘ అమావాస్య వేడుకలు బోరంచలో సిద్ధం

ప్రతి సంవత్సరం భక్తులను ఆకర్షించే మాఘ అమావాస్య వేడుకలు బోరంచలో సిద్ధం

ప్రతి సంవత్సరం భక్తులను ఆకర్షించే మాఘ అమావాస్య వేడుకలు బోరంచలో సిద్ధం
January 16, 2026 07:46 PM 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామం మళ్ళీ భక్తుల సందర్శనలకు సన్నద్ధమవుతోంది. మంజీరా నది ఒడ్డున ఉన్న అతి పురాతన శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం మాఘ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రజలను ఆహ్వానిస్తోంది.దేవాలయ నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం, రేపు, 18వ తారీఖు ఆదివారం మాఘ అమావాస్య సందర్భంగా, శ్రీ సంగమేశ్వర దేవాలయం సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకం,హోమం,మరియు మంజీరా నదిలో గంగా స్నానాలు నిర్వహించబడతాయి.ఈ కార్య‌క్ర‌మానికి ముందు, 17వ తారీఖు శనివారం సాయంత్రం 6 గంటలకు మంజీరా నది వద్ద గంగాహారతి ప్రారంభమై, రాత్రి భక్తుల కోసం బోరంచ చుట్టుపక్కల గ్రామాల భుజం కళాకారులతో భజన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమం రాత్రి నుండి ఉదయానికి వరకు కొనసాగుతూ, భక్తులకు ఆధ్యాత్మిక అనుభవం అందిస్తుంది.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నారాయణఖేడ్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవ్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. చంద్రశేఖరరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు హాజరై, ప్రత్యేక పూజలో పాల్గొంటున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దేవాలయ నిర్వాహకులు, నారాయణఖేడ్ ప్రాంతీయ ప్రజలు అధిక సంఖ్యలో గంగా స్నానాలు కార్యక్రమంలో పాల్గొని, పండుగను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాంతరంలో, భక్తుల కోసం అన్నదానం కూడా నిర్వహించబడనుంది.స్థానికులు పేర్కొన్నట్లు, ఈ మాఘ అమావాస్య వేడుక బోరంచ గ్రామానికి మాత్రమే కాకుండా, పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని, సంప్రదాయానికి పునరుజ్జీవాన్ని అందిస్తుంది.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News