Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 08:08 AM

ప్రతి గ్రామంలో శాంతి భద్రతపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ :ఎస్ఐ సోమేశ్వరి సేవలకు గుర్తింపు

ప్రతి గ్రామంలో శాంతి భద్రతపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ :ఎస్ఐ సోమేశ్వరి సేవలకు గుర్తింపు

ప్రతి గ్రామంలో శాంతి భద్రతపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ :ఎస్ఐ సోమేశ్వరి సేవలకు గుర్తింపు
January 14, 2026 07:19 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:కొండాపూర్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రశాంతంగా ఎన్నికలు ముగించడంలో ముఖ్య పాత్ర పోషించిన ఎస్ఐ సోమేశ్వరి మరియు వారి సిబ్బందిని ఘనంగా సన్మానించింది సామ్రాట్ గోవర్ధన్ సివిల్ సప్లై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ, సంగారెడ్డి జిల్లా డైరెక్టర్.పంచాయతీ ఎన్నికల ప్రారంభం నుండి చివరి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా పర్యవేక్షించినందుకు ఎస్సై సోమేశ్వరి చేసిన సేవలను సంఘం కొనియాడింది. సమరం (ఎన్నికల సమయంలో) సై దేనికైనా సిద్ధంగా, గట్టి నియమాలకు అనుగుణంగా, అన్ని సమస్యలను సక్రమంగా పరిష్కరించిన విధానాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.కొండాపూర్ మండలంలోని ప్రతి గ్రామంలో శాంతి భద్రతలను సుస్థిరంగా నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సిబ్బందితో కలిసి సమస్యలు తక్షణమే పరిష్కరించినందుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమంలో ఎస్సై సోమేశ్వరి, ఏఎస్ఐ రామ్మోహన్, హెడ్ కానిస్టేబుల్ ఆర్ బసవరాజ్, కానిస్టేబుల్ ముస్తఫా, జగన్నాథ్, పాండు మరియు మహిళా కానిస్టేబుల్ సబా పాల్గొన్నారు.సభలో ఎస్సై సోమేశ్వరి మరియు వారి సిబ్బందిని సన్మానిస్తూ, వారి పటిష్టమైన సేవలను, కష్టపడి చేసిన పని విలువను గుర్తించగా, భవిష్యత్తులో కూడా శాంతి భద్రత కోసం ఇలాగే నిబద్ధతగా పనిచేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News