Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:03 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యాధికారులు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యాధికారులు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యాధికారులు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు
January 10, 2026 12:47 AM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యాధికారులు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో మండలాల వారీగా పి.ఎచ్.సిలు,పల్లె దవాఖాన లో జరిగే వైద్యం,ప్రసవాలుపై రివ్యూ చేసిన జిల్లా కలెక్టర్.జిల్లాలో ప్రభుత్వ దవాఖానాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు, ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు ఉన్నాకూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెలివరీలు జరగడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.పల్లె దవాఖానలల్లో వైద్యులు సరిగా అందుబాటులో లేకపోవడం వలన మూతబడి ఉంటున్నాయని అన్నారు. అలా ఉన్న వారికి ఇప్పటి వరకు షోకాజ్ నోటీసులు ఇచ్చాం ఇకపై అలా చేస్తే నోటీసులు ఉండవని సస్పెండ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.కొన్ని దవాఖానలో లేబర్ రూమ్ లు కేవలం నామమాత్రం గానే ఉన్నాయని, అలా ఉండటానికి వీలు లేదని, ప్రతి దవాఖానలో నార్మల్ డెలివరీలు చేయాలని, ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు.ప్రతి మంగళవారం ఆశ డే అని సమావేశాలు మాత్రమే పెడుతున్నారు,కాని క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదని,గ్రామాల నుండి గర్భిణిని స్త్రీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారంటే ఆశాలు సరిగా పనిచేయడం లేదని అర్థంఅని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు అన్నారు.ప్రతి నెల రివ్యూ చేపట్టడం జరుగుతుందన్నారు. పల్లె దవాఖానల్లో పేషెంట్లు తక్కువగా వస్తున్నారని, ఖాళీగా ఉన్న సమయంలో ప్రతి గర్భిణి స్త్రీ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో జరగాలని, ప్రైవేట్ ఆసుపత్రికి పంపడానికి వీలు లేదన్నారు.ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్,డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి యశోద,వీణ,ప్రోగ్రామ్ ఆఫీసర్ రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్స్,ఎం.ఎల్ హెచ్ పిలు,వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News