Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:34 AM

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంత రావు
10-01-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

బీబీనగర్ మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి,విధుల్లో ఉన్న వైద్యులు,సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు.వైద్యులు,సిబ్బంది అందరూ విధుల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని, వారిలో ఎంతమంది ఇన్ పేషంట్లుగా అడ్మిట్ అవుతున్నారని, వైద్యులు, సిబ్బంది సరిపడా సంఖ్యలో ఉన్నారా,ఔషధాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం అయిన రోజు నుండి ఆసుపత్రిలో ఎన్ని సాధారణ ప్రసవాలు జరిగాయని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు చేయడం జరిగిందని,ఇక్కడే అవుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆసుపత్రి సరిగ్గా లేక ప్రసవాల కోసం బయటకి వెళ్లారని,ప్రస్తుతం మంచి భవనం ఉంది కాబట్టి ప్రసవాలు ఇక్కడే జరిగేలా చూడాలన్నారు. డిడిల రిజిస్టర్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలన్నారు.తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు జరుపుతానని,నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అసంపూర్తిగా ఫ్లోర్ లో ఉన్న బిల్డింగ్ ను శుభ్రం చేయాలని, బిల్డింగ్ పైకి వెళ్ళడానికి మెట్లు,చుట్టూ కాంపౌండ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

Article Image
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

బీబీనగర్ మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి,విధుల్లో ఉన్న వైద్యులు,సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు.వైద్యులు,సిబ్బంది అందరూ విధుల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని, వారిలో ఎంతమంది ఇన్ పేషంట్లుగా అడ్మిట్ అవుతున్నారని, వైద్యులు, సిబ్బంది సరిపడా సంఖ్యలో ఉన్నారా,ఔషధాలు పూర్తి స్థాయిలో ఉన్నాయా అని ఆరా తీశారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం అయిన రోజు నుండి ఆసుపత్రిలో ఎన్ని సాధారణ ప్రసవాలు జరిగాయని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు చేయడం జరిగిందని,ఇక్కడే అవుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆసుపత్రి సరిగ్గా లేక ప్రసవాల కోసం బయటకి వెళ్లారని,ప్రస్తుతం మంచి భవనం ఉంది కాబట్టి ప్రసవాలు ఇక్కడే జరిగేలా చూడాలన్నారు. డిడిల రిజిస్టర్ ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలన్నారు.తాను క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు జరుపుతానని,నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అసంపూర్తిగా ఫ్లోర్ లో ఉన్న బిల్డింగ్ ను శుభ్రం చేయాలని, బిల్డింగ్ పైకి వెళ్ళడానికి మెట్లు,చుట్టూ కాంపౌండ్ వాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News