ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన దారావతు మల్లిఖార్జునరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ హోలీ పండుగ సోదరభావానికి, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. రంగుల హోలీ ద్వారా మనస్పర్థలు మరచి సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
బాణావతు ఏసుబాబు, బాణావతు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో యువత ఉత్సాహంగా పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, పాటలు, నృత్యాలతో వేడుకలు సందడిగా కొనసాగాయి.
గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి