PRINT TIME: March 17, 2026 06:02 PM
పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు
పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం. ఎస్ ఐ డి. నాగరాజు
March 17, 2026 04:34 PM
24 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
పండుగల ముందు పోలీసుల సమావేశం
రామన్నపేట: రంజాన్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం రామన్నపేట పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ డి. నాగరాజు మాట్లాడుతూ రంజాన్ పండుగను స్నేహభావంతో, కులమత భేదాలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులను కోరారు. అలాగే రంజాన్ తర్వాత వచ్చే ఉగాది, శ్రీరామనవమి పండుగలను కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసి సామరస్యంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప సర్పంచ్ రమేష్, ఎండీ అన్వర్, ఇతర కమిటీ సభ్యులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి