ఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు
జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే / ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహా ఐపీఎస్ గారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
చట్ట అమలులో ఎలాంటి అలసత్వం చూపకుండా ప్రతి కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. గ్రీవెన్స్ డే ద్వారా వచ్చిన ఫిర్యాదుల స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి