Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు: రవిచంద్ర బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 02, 2026 10:04 PM

పోలేరమ్మ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

పోలేరమ్మ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

పోలేరమ్మ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
May 02, 2026 08:39 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని దూదగోండ గ్రామంలో పోలేరమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు.ఈ కార్యక్రమంలో తోర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్,యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ కోనాపురం చంద్రశేఖర్,మానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని పోలేరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను గ్రామ సర్పంచ్, గ్రామ ఉపసర్పంచ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాలిపటేల్ శివకాంత్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News