పోలేరమ్మ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
పోలేరమ్మ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని దూదగోండ గ్రామంలో పోలేరమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు.ఈ కార్యక్రమంలో తోర్నల్ గ్రామ సర్పంచ్ సంగమేష్ పటేల్,యూత్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీ కోనాపురం చంద్రశేఖర్,మానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ రావు పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని పోలేరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను గ్రామ సర్పంచ్, గ్రామ ఉపసర్పంచ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాలిపటేల్ శివకాంత్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి