Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:07 AM

పోచంపల్లిని చేనేత–టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనురాగ్ జయంతి

పోచంపల్లిని చేనేత–టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనురాగ్ జయంతి

పోచంపల్లిని చేనేత–టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనురాగ్ జయంతి
25-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి,

దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పోచంపల్లి చేనేతను ఆధారంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని చేనేత వస్త్ర వ్యాపారం మరియు టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

బుధవారం పోచంపల్లి మండల కేంద్రంలో టూరిజం పార్క్, చేనేత వృత్తిదారుల ఇళ్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. పోచంపల్లి చెరువు ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్షిస్తూ, పనులను వేగవంతంగా పూర్తి చేసి టూరిజం దృష్ట్యా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

అనంతరం పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన కలెక్టర్, ఇక్కత్ ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి సంక్షేమం, సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిజం, చేనేత రంగాలు పరస్పరం అనుసంధానమై అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మార్కెటింగ్ సదుపాయాలను విస్తరించి పోచంపల్లిని ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

తదుపరి జాలాల్పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. చేనేత రంగానికి అనుగుణంగా కొత్త డిజైన్ల రూపకల్పనకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం జలాల్‌పూర్ గ్రామంలోని అర్బన్ ఫారెస్ట్ పార్క్, లేక్ వ్యూ పార్క్‌లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ ఏడి ఎ.శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోచంపల్లిని చేనేత–టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

పోచంపల్లి,

దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పోచంపల్లి చేనేతను ఆధారంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని చేనేత వస్త్ర వ్యాపారం మరియు టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

బుధవారం పోచంపల్లి మండల కేంద్రంలో టూరిజం పార్క్, చేనేత వృత్తిదారుల ఇళ్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. పోచంపల్లి చెరువు ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్షిస్తూ, పనులను వేగవంతంగా పూర్తి చేసి టూరిజం దృష్ట్యా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

అనంతరం పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన కలెక్టర్, ఇక్కత్ ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి సంక్షేమం, సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిజం, చేనేత రంగాలు పరస్పరం అనుసంధానమై అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మార్కెటింగ్ సదుపాయాలను విస్తరించి పోచంపల్లిని ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

తదుపరి జాలాల్పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. చేనేత రంగానికి అనుగుణంగా కొత్త డిజైన్ల రూపకల్పనకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం జలాల్‌పూర్ గ్రామంలోని అర్బన్ ఫారెస్ట్ పార్క్, లేక్ వ్యూ పార్క్‌లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ ఏడి ఎ.శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News