Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాభివృద్ధికి దాతలు ముందుకు రావాలి: సర్పంచ్ వెంకటేశం స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 07:23 PM

పోచంపల్లిని చేనేత–టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనురాగ్ జయంతి

పోచంపల్లిని చేనేత–టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనురాగ్ జయంతి

పోచంపల్లిని చేనేత–టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 25, 2026 05:32 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోచంపల్లి,

దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన పోచంపల్లి చేనేతను ఆధారంగా చేసుకుని ఈ ప్రాంతాన్ని చేనేత వస్త్ర వ్యాపారం మరియు టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

బుధవారం పోచంపల్లి మండల కేంద్రంలో టూరిజం పార్క్, చేనేత వృత్తిదారుల ఇళ్లను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. పోచంపల్లి చెరువు ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్షిస్తూ, పనులను వేగవంతంగా పూర్తి చేసి టూరిజం దృష్ట్యా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

అనంతరం పోచంపల్లి చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన కలెక్టర్, ఇక్కత్ ఉత్పత్తులను పరిశీలించారు. చేనేత కార్మికులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి సంక్షేమం, సమస్యలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిజం, చేనేత రంగాలు పరస్పరం అనుసంధానమై అభివృద్ధి చెందేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మార్కెటింగ్ సదుపాయాలను విస్తరించి పోచంపల్లిని ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు.

తదుపరి జాలాల్పూర్ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. చేనేత రంగానికి అనుగుణంగా కొత్త డిజైన్ల రూపకల్పనకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం జలాల్‌పూర్ గ్రామంలోని అర్బన్ ఫారెస్ట్ పార్క్, లేక్ వ్యూ పార్క్‌లను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత శాఖ ఏడి ఎ.శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News