నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో నోచ్ లాబ్స్లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఘటన వివరాలపై అధికారులను ప్రశ్నించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి