Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:40 AM

పిట్టంపల్లిలో నోచ్ లాబ్స్ ప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

పిట్టంపల్లిలో నోచ్ లాబ్స్ ప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

పిట్టంపల్లిలో నోచ్ లాబ్స్ ప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
10-04-2026 212 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో నోచ్ లాబ్స్‌లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఘటన వివరాలపై అధికారులను ప్రశ్నించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Sthanikam

పిట్టంపల్లిలో నోచ్ లాబ్స్ ప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో నోచ్ లాబ్స్‌లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఘటన వివరాలపై అధికారులను ప్రశ్నించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News