Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:41 AM

పిట్టంపల్లిలో నోచ్ లాబ్స్ ప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

పిట్టంపల్లిలో నోచ్ లాబ్స్ ప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం

పిట్టంపల్లిలో నోచ్ లాబ్స్ ప్రమాదం: ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
April 10, 2026 12:11 PM 208 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో నోచ్ లాబ్స్‌లో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఘటన వివరాలపై అధికారులను ప్రశ్నించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని పరిస్థితులను సమీక్షించారు. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News