PRINT TIME: March 16, 2026 01:48 PM
పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు
పిన్నాయిపాలెంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు
March 16, 2026 11:53 AM
23 Views
స్థానికం ప్రతినిధి :
సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud
పిన్నాయిపాలెం గ్రామంలోని పశువులను గాలికుంటు వ్యాధి నుంచి రక్షించేందుకు ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చింత భవాని మధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించారు.
పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన టీకాల కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. గ్రామంలోని పశువులకు వరుసగా టీకాలు వేయించి వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతు జెర్రిపోతుల అంజయ్య పాల్గొన్నారు. గ్రామ రైతులు కూడా హాజరై పశువులకు టీకాలు వేయించుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి