Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:35 AM

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష..! మహబూబాబాద్‌లో వినూత్న హెచ్చరిక బోర్డు

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష..! మహబూబాబాద్‌లో వినూత్న హెచ్చరిక బోర్డు

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష..! మహబూబాబాద్‌లో వినూత్న హెచ్చరిక బోర్డు
09-03-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ యజమాని పెట్టిన బోర్డు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేసిన బోర్డులో “ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే 441 సెక్షన్ కింద చర్యలు.. మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.5,000 జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో ఫంక్షన్ హాల్లో జరిగే వివాహాలు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానం లేకుండానే కొంతమంది వచ్చి భోజనం చేసి వెళ్లిపోతున్నారని యజమాని వాపోయాడు. దీంతో నిర్వాహకులకు అసౌకర్యం కలగడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల హాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు కొందరు వెనుకడుగు వేస్తుండటంతో గిరాకీ కూడా తగ్గిందని పేర్కొన్నారు.

ఈ సమస్యను నివారించేందుకు ఫంక్షన్ హాల్ ఎదుట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు యజమాని తెలిపారు. ప్రస్తుతం ఆ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.

“పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష” అంటూ పెట్టిన ఈ బోర్డు స్థానికంగా కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Sthanikam

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష..! మహబూబాబాద్‌లో వినూత్న హెచ్చరిక బోర్డు

Article Image

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ యజమాని పెట్టిన బోర్డు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఫంక్షన్ హాల్ ముందు ఏర్పాటు చేసిన బోర్డులో “ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే 441 సెక్షన్ కింద చర్యలు.. మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.5,000 జరిమానా విధించబడుతుంది” అని స్పష్టంగా హెచ్చరించారు.

ఇటీవలి కాలంలో ఫంక్షన్ హాల్లో జరిగే వివాహాలు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానం లేకుండానే కొంతమంది వచ్చి భోజనం చేసి వెళ్లిపోతున్నారని యజమాని వాపోయాడు. దీంతో నిర్వాహకులకు అసౌకర్యం కలగడంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల హాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు కొందరు వెనుకడుగు వేస్తుండటంతో గిరాకీ కూడా తగ్గిందని పేర్కొన్నారు.

ఈ సమస్యను నివారించేందుకు ఫంక్షన్ హాల్ ఎదుట హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు యజమాని తెలిపారు. ప్రస్తుతం ఆ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.

“పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష” అంటూ పెట్టిన ఈ బోర్డు స్థానికంగా కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News