Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 01:16 AM

పిల్లలమర్రిలో కౌన్సిలర్లకు ఘన సన్మానం

పిల్లలమర్రిలో కౌన్సిలర్లకు ఘన సన్మానం

పిల్లలమర్రిలో కౌన్సిలర్లకు ఘన సన్మానం
March 01, 2026 06:30 PM 184 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా తాపే పనివారుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ

పిల్లలమర్రి గ్రామంలో జిల్లా తాపే పనివారుల సంఘం తరఫున సూర్యాపేట మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 10వ వార్డు కౌన్సిలర్ వెంకటి శేఖర్ రెడ్డి , 11వ వార్డు కౌన్సిలర్ వెలుగూరి ఇంద్ర వీరయ్య , 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు ని సంఘం నాయకులు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. అదేవిధంగా పిల్లలమర్రి శివాలయం కమిటీ చైర్మన్ కొండ వెంకన్న , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకుపల్లి చంద్రశేఖర్ , ఆదిమల్ల కృష్ణ , బోళ్ల శేఖర్ రెడ్డి , చెరుకుపల్లి సైదులు , పాలడుగు శ్రీకాంత్ ని కూడా సంఘం తరఫున ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. సన్మాన కమిటీ అధ్యక్షులు కొత్వాల రవి , ఉపాధ్యక్షులు బురుగుల శరత్, కార్యదర్శి చెరుకుపల్లి మధు, మాజీ అధ్యక్షులు చందుపట్ల రవి, సుతారి, తాపే సీనియర్ నాయకులు చింత మూత్తిలింగం, చెరుకుపల్లి శివ, చెరుకుపల్లి రవి, ఎస్.కె జానీమియా, పోకల కిరణ్, గంగాధరి జానయ్య, చెరుకుపల్లి ఎల్లయ్య, ఓరుగంటి రాములు, చింత ఎల్లయ్య, పోట్టపాక లక్ష్మణ్ రాముడు, ఇరుగు సైదులు నాగయ్య, నరేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామస్తులు, కార్మికులు భారీ సంఖ్యలో హాజరై నూతన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News