పిల్లలమర్రిలో కౌన్సిలర్లకు ఘన సన్మానం
పిల్లలమర్రిలో కౌన్సిలర్లకు ఘన సన్మానం
Biksham Goud
జిల్లా తాపే పనివారుల సంఘం ఆధ్వర్యంలో అభినందన సభ
పిల్లలమర్రి గ్రామంలో జిల్లా తాపే పనివారుల సంఘం తరఫున సూర్యాపేట మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన 10వ వార్డు కౌన్సిలర్ వెంకటి శేఖర్ రెడ్డి , 11వ వార్డు కౌన్సిలర్ వెలుగూరి ఇంద్ర వీరయ్య , 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు ని సంఘం నాయకులు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు. అదేవిధంగా పిల్లలమర్రి శివాలయం కమిటీ చైర్మన్ కొండ వెంకన్న , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకుపల్లి చంద్రశేఖర్ , ఆదిమల్ల కృష్ణ , బోళ్ల శేఖర్ రెడ్డి , చెరుకుపల్లి సైదులు , పాలడుగు శ్రీకాంత్ ని కూడా సంఘం తరఫున ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. సన్మాన కమిటీ అధ్యక్షులు కొత్వాల రవి , ఉపాధ్యక్షులు బురుగుల శరత్, కార్యదర్శి చెరుకుపల్లి మధు, మాజీ అధ్యక్షులు చందుపట్ల రవి, సుతారి, తాపే సీనియర్ నాయకులు చింత మూత్తిలింగం, చెరుకుపల్లి శివ, చెరుకుపల్లి రవి, ఎస్.కె జానీమియా, పోకల కిరణ్, గంగాధరి జానయ్య, చెరుకుపల్లి ఎల్లయ్య, ఓరుగంటి రాములు, చింత ఎల్లయ్య, పోట్టపాక లక్ష్మణ్ రాముడు, ఇరుగు సైదులు నాగయ్య, నరేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామస్తులు, కార్మికులు భారీ సంఖ్యలో హాజరై నూతన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి