పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం
పిల్లలమర్రిలో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం
Biksham
పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణ పనులను ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ కోడి నాగరాజు, 10వ వార్డు కౌన్సిలర్ వెక్కటి శేఖర్రెడ్డి, శివాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్, గవ్వ ప్రతాప్రెడ్డి, చింతలచెర్వు పూర్ణయ్య, కాంట్రాక్టర్ కొడిదల శ్రీనివాస్రెడ్డి, కనుకు వెంకన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బ్రిడ్జి నిర్మాణంతో స్థానిక ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. స్థానికులు బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి