PRINT TIME: June 22, 2026 12:34 PM
పిల్లలమర్రి శివాలయంలో త్రయోదశి వేడుకలు ఘనంగా
పిల్లలమర్రి శివాలయంలో త్రయోదశి వేడుకలు ఘనంగా
April 16, 2026 09:41 AM
75 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట: జిల్లాలోని పిల్లలమర్రి శివాలయంలో త్రయోదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిన్న సాయంత్రం భక్త కోటి జన సమూహం మధ్య వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి.
ఈ సందర్భంగా సుమారు వెయ్యి సంవత్సరాల నాటి నందీశ్వరుడికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
విశేష పూజల సందర్భంగా వేద మంత్రోచ్చారణల మధ్య అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి