పిల్లలమర్రి శివాలయాల్లో విశేష పూజలు
పిల్లలమర్రి శివాలయాల్లో విశేష పూజలు
Biksham
చారిత్రాత్మక 12వ శతాబ్దపు కాకతీయ కాలంనాటి పిల్లలమర్రి శివాలయాల్లో మంగళవారం మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శ్రీ సరస్వతి అమ్మవారికి విశేష అభిషేకం, నూతన వస్త్రాలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.
అనంతరం శ్రీచక్ర దేవతకు మహిళా భక్తుల ఆధ్వర్యంలో కుంకుమ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆలయ అర్చకులు భక్తుల శ్రేయస్సు, లోకకల్యాణం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి పారవశ్య వాతావరణంలో ఘనంగా జరిగాయి. పిల్లలమర్రి చారిత్రాత్మక శివాలయ ప్రాంగణంలో శ్రీచక్ర దేవత సన్నిధిలో భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహిస్తున్న మహిళా భక్తులు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి