Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 02:56 PM

పిల్లలమర్రి కాకతీయ శివాలయంలో ఘనంగా రథోత్సవం

పిల్లలమర్రి కాకతీయ శివాలయంలో ఘనంగా రథోత్సవం

పిల్లలమర్రి కాకతీయ శివాలయంలో ఘనంగా రథోత్సవం
February 17, 2026 10:40 AM 735 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

ఓం నమశ్శివాయ నినాదాలతో మార్మోగిన వీధులు

సూర్యాపేట: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో కాకతీయ కాలం నాటి ప్రసిద్ధ శివాలయంలో మహాశివరాత్రి జాతర మూడో రోజు రథోత్సవం వైభవంగా జరిగింది.శ్రీ పార్వతి నామేశ్వరాలయం నుండి ఎరికేశ్వరాలయం వరకు రథోత్సవం నిర్వహించారు. రథంపై స్వామివారిని ఊరేగించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు “ఓం నమశ్శివాయ” అంటూ నినాదాలు చేస్తూ రథాన్ని లాగుతూ భక్తి పరవశంలో మునిగిపోయారు. గ్రామ వీధులన్నీ శివనామ స్మరణతో మార్మోగాయి.ఈ కార్యక్రమంలో శివాలయ అర్చకులు సంతోష్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News