Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:45 PM

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం
February 18, 2026 05:47 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: కట్టా శేఖరరావు

కూసుమంచి:

కూసుమంచి మండలంలోని జడ్పీహెచ్ఎస్ కూసుమంచి పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఈర్ల కృష్ణను పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షులు కట్టా శేఖరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియు ప్రధాన లక్ష్యమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డి.ఎలను వెంటనే విడుదల చేయాలని, సేవలో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షను రద్దు చేయాలని, వేతన సవరణ సంఘం నివేదికను తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఈర్ల కృష్ణను అభినందిస్తూ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఈర్ల కృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ బలోపేతం, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు కూసుమంచి మండల అధ్యక్షులు శీలం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం. సతీష్, రాష్ట్ర బాధ్యులు సాదే వెంకన్న, సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్, శోభన్ బాబు, సర్వర్మియా, ఉపాధ్యాయులు నరేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News