Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:38 AM

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం
February 18, 2026 05:47 PM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: కట్టా శేఖరరావు

కూసుమంచి:

కూసుమంచి మండలంలోని జడ్పీహెచ్ఎస్ కూసుమంచి పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఈర్ల కృష్ణను పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షులు కట్టా శేఖరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియు ప్రధాన లక్ష్యమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డి.ఎలను వెంటనే విడుదల చేయాలని, సేవలో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షను రద్దు చేయాలని, వేతన సవరణ సంఘం నివేదికను తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఈర్ల కృష్ణను అభినందిస్తూ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఈర్ల కృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ బలోపేతం, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు కూసుమంచి మండల అధ్యక్షులు శీలం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం. సతీష్, రాష్ట్ర బాధ్యులు సాదే వెంకన్న, సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్, శోభన్ బాబు, సర్వర్మియా, ఉపాధ్యాయులు నరేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News