Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం

పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా ఈర్ల కృష్ణ నియామకం
February 18, 2026 05:47 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: కట్టా శేఖరరావు

కూసుమంచి:

కూసుమంచి మండలంలోని జడ్పీహెచ్ఎస్ కూసుమంచి పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఈర్ల కృష్ణను పిఆర్టియు జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాన్ని జిల్లా అధ్యక్షులు కట్టా శేఖరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పిఆర్టియు ప్రధాన లక్ష్యమని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డి.ఎలను వెంటనే విడుదల చేయాలని, సేవలో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్షను రద్దు చేయాలని, వేతన సవరణ సంఘం నివేదికను తక్షణమే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఈర్ల కృష్ణను అభినందిస్తూ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం కృషి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఈర్ల కృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ బలోపేతం, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు కూసుమంచి మండల అధ్యక్షులు శీలం ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎం. సతీష్, రాష్ట్ర బాధ్యులు సాదే వెంకన్న, సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్, శోభన్ బాబు, సర్వర్మియా, ఉపాధ్యాయులు నరేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News