Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:52 AM

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని
January 27, 2026 09:10 PM 301 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి

అసభ్య పదజాలంతో దూషన

అధికారుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

వలిగొండ మండల కేంద్రంలోని కిరాణా షాపులను,హెూటల్స్ ను జిల్లా ఇన్చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ శివ శంకర్ రెడ్డి తనిఖీలు చేస్తున్న సమయంలో కిరణ్ షాప్ యజమాని దాడి చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మాతాజీ కిరాణం షాపు తనిఖీ చేసిన అనంతరం మణికంఠ కిరాణాల షాపులోని ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి షాపులోకి వెళుతుండగా షాపు యజమాని నాగభూషణం ఆయన భార్య లలిత,కొడుకు మణికంఠలు ముగ్గురు కలిసి దుర్భాషలాడుతూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ అధికారుల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ తనిఖీని అడ్డుకున్నారని,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా పై అధికారుల సూచన మేరకు స్థానిక పోలీసుల సహకారంతో షాపులు తనిఖీలు నిర్వహించామని, ఆహార పదార్థాలు గడువు కాలం ముగిసిన ఫ్యాక్ చేసిన ఆహార పదార్థాలు పాటు అధిక మొత్తంలో రంగులు రసాయనాలు వాడినట్లుగా గుర్తించి శాంపిల్ సేకరించిన్నట్లు తెలిపారు. తనిఖీలు చేసిన సమయంలో మొబైల్ ఫోన్ లాక్కుని ధ్వంసం చేసే ప్రయత్నంతో పాటు మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News