Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని

ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని
January 27, 2026 09:10 PM 306 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ స్థానికం ప్రతినిధి

అసభ్య పదజాలంతో దూషన

అధికారుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

వలిగొండ మండల కేంద్రంలోని కిరాణా షాపులను,హెూటల్స్ ను జిల్లా ఇన్చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ శివ శంకర్ రెడ్డి తనిఖీలు చేస్తున్న సమయంలో కిరణ్ షాప్ యజమాని దాడి చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మాతాజీ కిరాణం షాపు తనిఖీ చేసిన అనంతరం మణికంఠ కిరాణాల షాపులోని ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి షాపులోకి వెళుతుండగా షాపు యజమాని నాగభూషణం ఆయన భార్య లలిత,కొడుకు మణికంఠలు ముగ్గురు కలిసి దుర్భాషలాడుతూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ అధికారుల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ తనిఖీని అడ్డుకున్నారని,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా పై అధికారుల సూచన మేరకు స్థానిక పోలీసుల సహకారంతో షాపులు తనిఖీలు నిర్వహించామని, ఆహార పదార్థాలు గడువు కాలం ముగిసిన ఫ్యాక్ చేసిన ఆహార పదార్థాలు పాటు అధిక మొత్తంలో రంగులు రసాయనాలు వాడినట్లుగా గుర్తించి శాంపిల్ సేకరించిన్నట్లు తెలిపారు. తనిఖీలు చేసిన సమయంలో మొబైల్ ఫోన్ లాక్కుని ధ్వంసం చేసే ప్రయత్నంతో పాటు మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News