ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని
ఫుడ్ సేఫ్టీ అధికారి విధులకు ఆటంకం కలిగించిన షాప్ యజమాని
Vaddeman Suresh
వలిగొండ స్థానికం ప్రతినిధి
అసభ్య పదజాలంతో దూషన
అధికారుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
వలిగొండ మండల కేంద్రంలోని కిరాణా షాపులను,హెూటల్స్ ను జిల్లా ఇన్చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ శివ శంకర్ రెడ్డి తనిఖీలు చేస్తున్న సమయంలో కిరణ్ షాప్ యజమాని దాడి చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మాతాజీ కిరాణం షాపు తనిఖీ చేసిన అనంతరం మణికంఠ కిరాణాల షాపులోని ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి షాపులోకి వెళుతుండగా షాపు యజమాని నాగభూషణం ఆయన భార్య లలిత,కొడుకు మణికంఠలు ముగ్గురు కలిసి దుర్భాషలాడుతూ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ అధికారుల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ తనిఖీని అడ్డుకున్నారని,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా పై అధికారుల సూచన మేరకు స్థానిక పోలీసుల సహకారంతో షాపులు తనిఖీలు నిర్వహించామని, ఆహార పదార్థాలు గడువు కాలం ముగిసిన ఫ్యాక్ చేసిన ఆహార పదార్థాలు పాటు అధిక మొత్తంలో రంగులు రసాయనాలు వాడినట్లుగా గుర్తించి శాంపిల్ సేకరించిన్నట్లు తెలిపారు. తనిఖీలు చేసిన సమయంలో మొబైల్ ఫోన్ లాక్కుని ధ్వంసం చేసే ప్రయత్నంతో పాటు మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించి ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి