Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 03:54 AM

ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్

ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్

ఫోన్ చేస్తే ఇంటికే పోలీస్
January 21, 2026 04:15 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా ఎస్పీ కె. నరసింహ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఫోన్ చేస్తే ఇంటికే పోలీసులు వచ్చి బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించి అక్కడి నుంచే కేసులు నమోదు చేసే నూతన కార్యాచరణను సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ పటిష్టంగా అమలు చేస్తుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ విధానాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుచేస్తున్నట్లు చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు రాలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది వారి నివాసానికి వెళ్లి పిర్యాదు స్వీకరించి వెంటనే కేసు నమోదు చేసి భరోసా కల్పించనున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు.ముఖ్యంగా మహిళా పిర్యాదుల విషయంలో మహిళా పోలీస్ సిబ్బంది వెంటనే బాధితుల వద్దకు చేరుకుంటారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు, మహిళలు, బాలలు, దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, భయాందోళనలతో బయటకు రాలేని వారికి ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.

శారీరక దాడులు, అట్రాసిటీ చట్టం కింద కేసులు, గృహహింస, బాల్య వివాహాలు, ర్యాగింగ్, మైనర్ వేదింపులు వంటి కేసుల్లో ఈ విధానం ద్వారా బాధితులకు వెంటనే సహాయం అందుతుందని అన్నారు. ఈ నూతన ప్రణాళిక అమలుకు సంబంధించి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.ప్రజలకు మరింత సులభమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News