ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు బ్యాక్లాగ్ పరీక్షల అవకాశం. సముద్రాల ఉపేందర్
ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థులకు బ్యాక్లాగ్ పరీక్షల అవకాశం. సముద్రాల ఉపేందర్
Editor Desk
నల్గొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో 2011–12 నుంచి 2022–23 విద్యా సంవత్సరాల మధ్య చేరి, డిగ్రీ మూడు సంవత్సరాలు పూర్తి చేసినప్పటికీ ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. బ్యాక్లాగ్ పరీక్షలను జూన్/జులై 2026లో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి తెలిపారు.
వారు మాట్లాడుతూ, బ్యాక్లాగ్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కళాశాలలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కార్యాలయం నుండి దరఖాస్తు ఫారం పొందాలని సూచించారు. అనంతరం ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తు ఫారంతో పాటు ఫీజు రసీదును సమర్పించాలని తెలిపారు.
పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మార్చి 25, 2026 నుంచి ఏప్రిల్ 15, 2026 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం కళాశాల నోటీసు బోర్డును పరిశీలించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి