Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:03 PM

ఫేస్‌బుక్ ప్రకటనతో మహిళ మోసం

ఫేస్‌బుక్ ప్రకటనతో మహిళ మోసం

ఫేస్‌బుక్ ప్రకటనతో మహిళ మోసం
12-04-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డబ్బు రెట్టింపు పేరుతో లక్ష్యంగా పెట్టిన మోసగాళ్లు

పల్నాడు ప్రతినిధి: సామాజిక మాధ్యమంలో వచ్చిన ప్రకటన నమ్మి ఓ మహిళ మోసపోయిన ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్లలో వెలుగుచూసింది. డబ్బు రెట్టింపు ఇస్తామని చెప్పిన ఆర్థిక సంస్థ మాటలను నమ్మి మహిళ యాభై వేల రూపాయలకు పైగా కోల్పోయింది. వివరాల ప్రకారం, ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటనలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో డబ్బు రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఆసక్తి చూపిన మహిళ ఫోన్ ద్వారా సంప్రదించగా, వారు నమ్మబలికారు. స్థానిక భారతీయ స్టేట్ బ్యాంకులో నాలుగు విడతలుగా మొత్తం 39,400 రూపాయలు జమ చేసింది. తరువాత ఇంకా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఫోన్ ద్వారా మరికొంత మొత్తం పంపింది.

ఇంట్లో విషయం తెలిసి కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో మహిళ మోసపోయిన విషయం బయటపడింది. డబ్బు తిరిగి ఇవ్వాలని ఆ సంస్థను సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆవేదన వ్యక్తం చేసింది. జాగ్రత్త అవసరం సామాజిక మాధ్యమాల్లో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మకూడదని పోలీసులు సూచిస్తున్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని చెప్పే ప్రకటనలు ఎక్కువగా మోసపూరితమేనని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద ప్రకటనలు కనిపించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Sthanikam

ఫేస్‌బుక్ ప్రకటనతో మహిళ మోసం

Article Image

డబ్బు రెట్టింపు పేరుతో లక్ష్యంగా పెట్టిన మోసగాళ్లు

పల్నాడు ప్రతినిధి: సామాజిక మాధ్యమంలో వచ్చిన ప్రకటన నమ్మి ఓ మహిళ మోసపోయిన ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్లలో వెలుగుచూసింది. డబ్బు రెట్టింపు ఇస్తామని చెప్పిన ఆర్థిక సంస్థ మాటలను నమ్మి మహిళ యాభై వేల రూపాయలకు పైగా కోల్పోయింది. వివరాల ప్రకారం, ఫేస్‌బుక్‌లో వచ్చిన ప్రకటనలో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలో డబ్బు రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. దీనిపై ఆసక్తి చూపిన మహిళ ఫోన్ ద్వారా సంప్రదించగా, వారు నమ్మబలికారు. స్థానిక భారతీయ స్టేట్ బ్యాంకులో నాలుగు విడతలుగా మొత్తం 39,400 రూపాయలు జమ చేసింది. తరువాత ఇంకా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఫోన్ ద్వారా మరికొంత మొత్తం పంపింది.

ఇంట్లో విషయం తెలిసి కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో మహిళ మోసపోయిన విషయం బయటపడింది. డబ్బు తిరిగి ఇవ్వాలని ఆ సంస్థను సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆవేదన వ్యక్తం చేసింది. జాగ్రత్త అవసరం సామాజిక మాధ్యమాల్లో వచ్చే పెట్టుబడి ప్రకటనలను నమ్మకూడదని పోలీసులు సూచిస్తున్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని చెప్పే ప్రకటనలు ఎక్కువగా మోసపూరితమేనని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద ప్రకటనలు కనిపించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News