Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:07 AM

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి – కూసుమంచిలో న్యూ డెమోక్రసీ ఆందోళన

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి – కూసుమంచిలో న్యూ డెమోక్రసీ ఆందోళన

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి – కూసుమంచిలో న్యూ డెమోక్రసీ ఆందోళన
21-03-2026 129 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కూసుమంచి మండల కేంద్రంలో పార్టీ నాయకులు నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, కార్మికులపై భారంగా మారిందన్నారు.

ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, బుర్ర సైదులు, బత్తుల ఉప్పలయ్య, మల్సూరు కోటయ్య, వీరభద్రం, రాజేష్, ప్రకాష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి – కూసుమంచిలో న్యూ డెమోక్రసీ ఆందోళన

Article Image

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కూసుమంచి మండల కేంద్రంలో పార్టీ నాయకులు నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, కార్మికులపై భారంగా మారిందన్నారు.

ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, బుర్ర సైదులు, బత్తుల ఉప్పలయ్య, మల్సూరు కోటయ్య, వీరభద్రం, రాజేష్, ప్రకాష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News