పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి – కూసుమంచిలో న్యూ డెమోక్రసీ ఆందోళన
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి – కూసుమంచిలో న్యూ డెమోక్రసీ ఆందోళన
ఎడిటోరియల్ టీమ్
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కూసుమంచి మండల కేంద్రంలో పార్టీ నాయకులు నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పాలేరు డివిజన్ కార్యదర్శి బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, కార్మికులపై భారంగా మారిందన్నారు.
ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, బుర్ర సైదులు, బత్తుల ఉప్పలయ్య, మల్సూరు కోటయ్య, వీరభద్రం, రాజేష్, ప్రకాష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి