Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:32 PM

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
May 18, 2026 06:15 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాజాంలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసన

రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు రాజాం పట్టణంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించాయి. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆధ్వర్యంలో మోటారు వాహనాన్ని పడుకోబెట్టి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించి, అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిందని విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు ప్రజలపై మరింత భారం మోపుతోందన్నారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ పరిశీలకులు కె.వి. సూర్యనారాయణ రాజు, గజపతినగరం అసెంబ్లీ పరిశీలకులు సిరిపురం జగన్ మోహన్ రావు, నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News