పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
Biksham
రాజాంలో వైఎస్సార్సీపీ వినూత్న నిరసన
రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు రాజాం పట్టణంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించాయి. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆధ్వర్యంలో మోటారు వాహనాన్ని పడుకోబెట్టి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించి, అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచిందని విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఇంధన ధరల పెంపు ప్రజలపై మరింత భారం మోపుతోందన్నారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజాం అసెంబ్లీ పరిశీలకులు కె.వి. సూర్యనారాయణ రాజు, గజపతినగరం అసెంబ్లీ పరిశీలకులు సిరిపురం జగన్ మోహన్ రావు, నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి