Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:46 PM

పేటలో అలరించిన కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్

పేటలో అలరించిన కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్

పేటలో అలరించిన కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్
March 22, 2026 05:25 PM 164 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సొంత తయారీతో 5 వేల డిజైన్లు – అందుబాటు ధరలతో ఆకట్టుకున్న ప్రదర్శన

సూర్యాపేట,

జిల్లా కేంద్రంలో కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సందడి చేసింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సొంత తయారీతో రూపొందించిన వేలాది డిజైన్ల ఆభరణాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఆదివారం బాలాజీ గ్రాండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను బిజినెస్ కోఆర్డినేటర్ ముస్త్యాల కిషన్, జనరల్ మేనేజర్ మిహెర్ షా, స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా అందమైన డిజైన్లలో జ్యువెలరీ తయారు చేసి అందుబాటు ధరల్లో అందించడం సంస్థ లక్ష్యమని తెలిపారు.

ఎగ్జిబిషన్‌లో డైమండ్, గోల్డ్, సిల్వర్ ఆభరణాలతో పాటు దేవతా విగ్రహాలు, కిరీటాలు కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. సుమారు 5 వేల రకాల డిజైన్లతో అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వివరించారు.

వినియోగదారులు కోరుకున్న డిజైన్లలో ప్రత్యేకంగా ఆభరణాలు తయారు చేసి అందించే సౌకర్యం కూడా కల్పించినట్లు తెలిపారు. సొంత తయారీ కావడంతో ధరలను పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, కార్బన్ లక్స్ జ్యువెలరీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News