Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 10:58 PM

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు
March 16, 2026 08:40 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు శుభాకాంక్షలు

మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు శుభాకాంక్షలు తెలిపారు.

2023లో సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రను ప్రారంభించారు. 108 రోజుల పాటు 1,360 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రను ఎండ, వానలను లెక్కచేయకుండా కొనసాగిస్తూ ఖమ్మం జిల్లా వరకు పూర్తి చేశారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో చేపట్టిన ఈ పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాయల నాగేశ్వరరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News