Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:58 PM

పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యలీడేషన్ చట్టని రద్దు చేయాలి.. పాలవరపు సంతోష్

పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యలీడేషన్ చట్టని రద్దు చేయాలి.. పాలవరపు సంతోష్

పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యలీడేషన్ చట్టని రద్దు చేయాలి.. పాలవరపు సంతోష్
March 25, 2026 06:34 PM 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షులు పాలవరపు సంతోష్ అన్నారు, బుధవారం పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టం-2025ను కేంద్రం తక్షణమే రద్దు చేయాలన్నారు ఈ పెన్షన్ విధానంతో పెన్షనర్లకు తీవ్ర నష్టం కలుగుతుందని అన్నారు. జనవరి ఒకటి 2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన వారిని, ఆ తర్వాత విరమణ పొందిన పెన్షనర్లను వేర్వేరుగా విభజించి వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రయోజనాలు ఉంటాయని చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నరు. ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ అనంతరం పొందే పెన్షన్ వారి జీవిత భద్రతకు గౌరవానికి ఆధారంగా ఉంటుందని అన్నారు, ఇది కేవలం ఒక ఆర్థిక లావాదేవీ మాత్రమే కాదని ప్రభుత్వ సేవకు అంకితమైన జీవితానికి ప్రత్యేక గుర్తింపు అని అన్నారు, పెన్షన్ వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పుల వల్ల పెన్షన్ ఉద్యోగులలో గందరగోళాన్ని ఆందోళనను కలిగిస్తున్నాయని అన్నారు, పెండింగ్ డిఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ దయానదం కు అందజేశారు ,ఈ ధర్నాకు మండల విశ్రాంతి ఉద్యోగులు తాళ్ల పెళ్లి యాదగిరి, కాసం మల్లయ్య, సుధాకర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, దాసు, ఎండి జాన్, పాలకుర్తి ఎల్లయ్య, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మారెడ్డి, గునిగంటి సోమయ్య, ఉపేందర్, శ్రీరాములు, మాధవరావు, పులుసు పుల్లయ్య, పురుషోత్తం, మౌలానా, లలిత, తోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య, రమేష్ గౌడ్ సంఘీభావం తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News