Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:37 PM

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!
February 10, 2026 06:52 AM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

23 నెలలుగా పెన్షన్ బకాయిలు లేవు… 61 మంది మృతి అయినా స్పందించని ప్రభుత్వం!

మా ఇంటికి కాంగ్రెస్ ఓటు అడిగే హక్కు లేదు

కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగి నిరసన

తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిల సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. 2024లో రిటైర్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇప్పటికీ 23 నెలలుగా రావాల్సిన పెన్షన్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి నిరసన వ్యక్తం చేశారు.పెన్షన్ బకాయిలు రాక తీవ్ర మానసిక వేదనకు లోనై రాష్ట్రవ్యాప్తంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో“పెన్షన్ బకాయిలు ఇవ్వని ప్రభుత్వానికి మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు లేదు”అని స్పష్టమైన సందేశం ఉంచారు.ఈ ఘటనకు REWA (రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్), కరీంనగర్ జిల్లా మద్దతు తెలిపింది. అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల జీవిత భరోసైన పెన్షన్‌ను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News