పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!
పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!
స్థానికం బృందం
23 నెలలుగా పెన్షన్ బకాయిలు లేవు… 61 మంది మృతి అయినా స్పందించని ప్రభుత్వం!
“మా ఇంటికి కాంగ్రెస్ ఓటు అడిగే హక్కు లేదు”
కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగి నిరసన
తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిల సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. 2024లో రిటైర్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇప్పటికీ 23 నెలలుగా రావాల్సిన పెన్షన్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి నిరసన వ్యక్తం చేశారు.పెన్షన్ బకాయిలు రాక తీవ్ర మానసిక వేదనకు లోనై రాష్ట్రవ్యాప్తంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో“పెన్షన్ బకాయిలు ఇవ్వని ప్రభుత్వానికి మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు లేదు”అని స్పష్టమైన సందేశం ఉంచారు.ఈ ఘటనకు REWA (రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్), కరీంనగర్ జిల్లా మద్దతు తెలిపింది. అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల జీవిత భరోసైన పెన్షన్ను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి