Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:35 AM

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!
February 10, 2026 06:52 AM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

23 నెలలుగా పెన్షన్ బకాయిలు లేవు… 61 మంది మృతి అయినా స్పందించని ప్రభుత్వం!

మా ఇంటికి కాంగ్రెస్ ఓటు అడిగే హక్కు లేదు

కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగి నిరసన

తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిల సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. 2024లో రిటైర్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇప్పటికీ 23 నెలలుగా రావాల్సిన పెన్షన్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి నిరసన వ్యక్తం చేశారు.పెన్షన్ బకాయిలు రాక తీవ్ర మానసిక వేదనకు లోనై రాష్ట్రవ్యాప్తంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో“పెన్షన్ బకాయిలు ఇవ్వని ప్రభుత్వానికి మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు లేదు”అని స్పష్టమైన సందేశం ఉంచారు.ఈ ఘటనకు REWA (రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్), కరీంనగర్ జిల్లా మద్దతు తెలిపింది. అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల జీవిత భరోసైన పెన్షన్‌ను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News