Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:44 AM

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!
10-02-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

23 నెలలుగా పెన్షన్ బకాయిలు లేవు… 61 మంది మృతి అయినా స్పందించని ప్రభుత్వం!

మా ఇంటికి కాంగ్రెస్ ఓటు అడిగే హక్కు లేదు

కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగి నిరసన

తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిల సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. 2024లో రిటైర్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇప్పటికీ 23 నెలలుగా రావాల్సిన పెన్షన్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి నిరసన వ్యక్తం చేశారు.పెన్షన్ బకాయిలు రాక తీవ్ర మానసిక వేదనకు లోనై రాష్ట్రవ్యాప్తంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో“పెన్షన్ బకాయిలు ఇవ్వని ప్రభుత్వానికి మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు లేదు”అని స్పష్టమైన సందేశం ఉంచారు.ఈ ఘటనకు REWA (రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్), కరీంనగర్ జిల్లా మద్దతు తెలిపింది. అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల జీవిత భరోసైన పెన్షన్‌ను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Sthanikam

పెన్షన్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం… 61 మంది రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు బలి!

Article Image

23 నెలలుగా పెన్షన్ బకాయిలు లేవు… 61 మంది మృతి అయినా స్పందించని ప్రభుత్వం!

మా ఇంటికి కాంగ్రెస్ ఓటు అడిగే హక్కు లేదు

కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగి నిరసన

తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిల సమస్య రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. 2024లో రిటైర్ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఇప్పటికీ 23 నెలలుగా రావాల్సిన పెన్షన్ బకాయిలు చెల్లించకపోవడంతో ఆయన ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి నిరసన వ్యక్తం చేశారు.పెన్షన్ బకాయిలు రాక తీవ్ర మానసిక వేదనకు లోనై రాష్ట్రవ్యాప్తంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో“పెన్షన్ బకాయిలు ఇవ్వని ప్రభుత్వానికి మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు లేదు”అని స్పష్టమైన సందేశం ఉంచారు.ఈ ఘటనకు REWA (రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్), కరీంనగర్ జిల్లా మద్దతు తెలిపింది. అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల జీవిత భరోసైన పెన్షన్‌ను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని, వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News