Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 09:05 PM

పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్

పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్

పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్
13-04-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్‌ పెళ్లి పేరుతో యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. నకిలీ వివరాలతో పరిచయం పెంచుకుని కోటిన్నర రూపాయల కట్నం డిమాండ్ చేసిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

నగరానికి చెందిన పనస మధు (30) ఒక మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో తప్పుడు వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు. తాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆహార సంస్థలో సాంకేతిక అధికారి‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన యువతితో పరిచయం ఏర్పరచుకుని, మాటలతో నమ్మించి ఆమె కుటుంబాన్ని కలిశాడు.

తన ఉద్యోగాన్ని నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డు చూపించడంతో యువతి కుటుంబం అతని మాటలను నమ్మింది. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందని గ్రహించిన మధు, తొలుత రెండు కోట్ల రూపాయల కట్నం డిమాండ్ చేశాడు. అనంతరం చర్చల తర్వాత కోటిన్నర రూపాయలకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది.ఇటీవల పెళ్లికి ముందు చిత్రీకరణ పేరుతో యువతిని నగరంలోని చైతన్యపురి ప్రాంతంలోని ఓ గదికి పిలిపించిన మధు, ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రంగా వేధించాడు. అతని ప్రవర్తనతో భయపడిన యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు మధు ఉద్యోగంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతను చెప్పినట్లుగా ప్రభుత్వ ఉద్యోగి కాదని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

Sthanikam

పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్

Article Image

హైదరాబాద్‌ పెళ్లి పేరుతో యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. నకిలీ వివరాలతో పరిచయం పెంచుకుని కోటిన్నర రూపాయల కట్నం డిమాండ్ చేసిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

నగరానికి చెందిన పనస మధు (30) ఒక మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో తప్పుడు వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు. తాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆహార సంస్థలో సాంకేతిక అధికారి‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన యువతితో పరిచయం ఏర్పరచుకుని, మాటలతో నమ్మించి ఆమె కుటుంబాన్ని కలిశాడు.

తన ఉద్యోగాన్ని నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డు చూపించడంతో యువతి కుటుంబం అతని మాటలను నమ్మింది. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందని గ్రహించిన మధు, తొలుత రెండు కోట్ల రూపాయల కట్నం డిమాండ్ చేశాడు. అనంతరం చర్చల తర్వాత కోటిన్నర రూపాయలకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది.ఇటీవల పెళ్లికి ముందు చిత్రీకరణ పేరుతో యువతిని నగరంలోని చైతన్యపురి ప్రాంతంలోని ఓ గదికి పిలిపించిన మధు, ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రంగా వేధించాడు. అతని ప్రవర్తనతో భయపడిన యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు మధు ఉద్యోగంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతను చెప్పినట్లుగా ప్రభుత్వ ఉద్యోగి కాదని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News