Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 03:58 PM

పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్

పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్

పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్
April 13, 2026 02:30 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

హైదరాబాద్‌ పెళ్లి పేరుతో యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. నకిలీ వివరాలతో పరిచయం పెంచుకుని కోటిన్నర రూపాయల కట్నం డిమాండ్ చేసిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

నగరానికి చెందిన పనస మధు (30) ఒక మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో తప్పుడు వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు. తాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆహార సంస్థలో సాంకేతిక అధికారి‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన యువతితో పరిచయం ఏర్పరచుకుని, మాటలతో నమ్మించి ఆమె కుటుంబాన్ని కలిశాడు.

తన ఉద్యోగాన్ని నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డు చూపించడంతో యువతి కుటుంబం అతని మాటలను నమ్మింది. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందని గ్రహించిన మధు, తొలుత రెండు కోట్ల రూపాయల కట్నం డిమాండ్ చేశాడు. అనంతరం చర్చల తర్వాత కోటిన్నర రూపాయలకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది.ఇటీవల పెళ్లికి ముందు చిత్రీకరణ పేరుతో యువతిని నగరంలోని చైతన్యపురి ప్రాంతంలోని ఓ గదికి పిలిపించిన మధు, ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రంగా వేధించాడు. అతని ప్రవర్తనతో భయపడిన యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు మధు ఉద్యోగంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతను చెప్పినట్లుగా ప్రభుత్వ ఉద్యోగి కాదని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News