పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్
పెళ్లి పేరుతో మోసం.. కోటిన్నర కట్నం డీల్.. కేటుగాడు అరెస్ట్
Biksham
హైదరాబాద్ పెళ్లి పేరుతో యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి చివరకు పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. నకిలీ వివరాలతో పరిచయం పెంచుకుని కోటిన్నర రూపాయల కట్నం డిమాండ్ చేసిన ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.
నగరానికి చెందిన పనస మధు (30) ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తప్పుడు వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు. తాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆహార సంస్థలో సాంకేతిక అధికారిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో నల్గొండకు చెందిన యువతితో పరిచయం ఏర్పరచుకుని, మాటలతో నమ్మించి ఆమె కుటుంబాన్ని కలిశాడు.
తన ఉద్యోగాన్ని నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డు చూపించడంతో యువతి కుటుంబం అతని మాటలను నమ్మింది. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందని గ్రహించిన మధు, తొలుత రెండు కోట్ల రూపాయల కట్నం డిమాండ్ చేశాడు. అనంతరం చర్చల తర్వాత కోటిన్నర రూపాయలకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది.ఇటీవల పెళ్లికి ముందు చిత్రీకరణ పేరుతో యువతిని నగరంలోని చైతన్యపురి ప్రాంతంలోని ఓ గదికి పిలిపించిన మధు, ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్రంగా వేధించాడు. అతని ప్రవర్తనతో భయపడిన యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు మధు ఉద్యోగంపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతను చెప్పినట్లుగా ప్రభుత్వ ఉద్యోగి కాదని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరచగా రిమాండ్కు తరలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి