పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్పై అసెంబ్లీలో ఒత్తిడి తేవాలి
పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్పై అసెంబ్లీలో ఒత్తిడి తేవాలి
Biksham
మాజీ మంత్రి హరీష్ రావుకు బీసీ జేఏసీ వినతి
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
హైదరాబాద్లో మాజీ మంత్రి టి. హరీష్ రావును బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు భద్రబోయిన సైదులు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో బీసీలకు, విద్యార్థులకు ఎదురవుతున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి విస్తృతంగా చర్చించారు.రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల స్కాలర్షిప్ల అంశాన్ని ప్రస్తావించి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి విద్యార్థిని, విద్యార్థులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేసేలా కృషి చేయాలని భద్రబోయిన సైదులు కోరారు.విద్యార్థుల భవిష్యత్తుకు స్కాలర్షిప్లు కీలకమని, ఆలస్యం వల్ల విద్యాభ్యాసం అడ్డంకులకు గురవుతోందని వివరించారు. ఈ అంశంపై అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించేందుకు చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి