పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి – రైతాంగానికి తక్షణ సాగునీరు అందించాలి: పల్లా వెంకట్ రెడ్డి
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి – రైతాంగానికి తక్షణ సాగునీరు అందించాలి: పల్లా వెంకట్ రెడ్డి
K.RAVI
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.చౌటుప్పల్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన ఎఫ్సీ చర్లగూడెం రిజర్వాయర్ను వేగంగా పూర్తి చేస్తే వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు చెందిన అనేక గ్రామాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. దీని ద్వారా భూగర్భ జలాలు పెరిగి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు.
ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగు, త్రాగునీటిని కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రపు నిధులు మాత్రమే కేటాయిస్తున్నారని విమర్శించారు. రాబోయే బడ్జెట్లో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సరిపడా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా మంత్రులు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. గతంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించామని, అవసరమైతే మళ్లీ ప్రజా పోరాటాలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరు అందే వరకు విడతల వారీగా ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు యానాల దామోదర్ రెడ్డి, కురిమిద్దె శ్రీనివాస్, పల్లె శేఖర్ రెడ్డి, పగిల్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, పొట్ట శంకరయ్య, రొండి నర్సింహా, టంగుటూరి రాములు, నర్సింహా, భాస్కర్, దాసరి మనోహర్, బోయ మంకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి