Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:56 AM

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి – రైతాంగానికి తక్షణ సాగునీరు అందించాలి: పల్లా వెంకట్ రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి – రైతాంగానికి తక్షణ సాగునీరు అందించాలి: పల్లా వెంకట్ రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి – రైతాంగానికి తక్షణ సాగునీరు అందించాలి: పల్లా వెంకట్ రెడ్డి
February 26, 2026 06:52 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాలని పల్లా వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.చౌటుప్పల్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టులో భాగంగా నిర్మించ తలపెట్టిన ఎఫ్‌సీ చర్లగూడెం రిజర్వాయర్‌ను వేగంగా పూర్తి చేస్తే వేలాది ఎకరాల భూములు సస్యశ్యామలం అవుతాయని పేర్కొన్నారు. రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపురం, చౌటుప్పల్ మండలాలకు చెందిన అనేక గ్రామాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. దీని ద్వారా భూగర్భ జలాలు పెరిగి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు.

ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగు, త్రాగునీటిని కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ నామమాత్రపు నిధులు మాత్రమే కేటాయిస్తున్నారని విమర్శించారు. రాబోయే బడ్జెట్‌లో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సరిపడా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా మంత్రులు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. గతంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించామని, అవసరమైతే మళ్లీ ప్రజా పోరాటాలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పూర్తిస్థాయిలో సాగునీరు అందే వరకు విడతల వారీగా ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు యానాల దామోదర్ రెడ్డి, కురిమిద్దె శ్రీనివాస్, పల్లె శేఖర్ రెడ్డి, పగిల్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, పొట్ట శంకరయ్య, రొండి నర్సింహా, టంగుటూరి రాములు, నర్సింహా, భాస్కర్, దాసరి మనోహర్, బోయ మంకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News