Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 05:17 PM

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి....

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి....

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి....
February 21, 2026 07:10 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారం తో వైద్యశాల లో వసతుల కల్పన కు కృషి....

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన శ్రీమతి ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తం గారి సహకారంతో వైద్యశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి ఉత్తమ సేవలందించి ఉత్తమ సేవలందించి పేరు సాధించాలన్నారు. కాగా మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు కౌన్సిలర్లు తోట జ్యోతి శ్రీనివాస్, జిల్లే పెల్లి నాగేశ్వరరావు లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, సిబ్బంది, మహిళా నాయకులు పబ్బ గీత తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News