పెద్దమంతూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా సైన్స్ దినోత్సవం
పెద్దమంతూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా సైన్స్ దినోత్సవం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం లోని పెద్దమంతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నూతన వర్కింగ్ మోడల్స్ రూపొందించి ప్రదర్శనకు ఉంచగా, మానవ అవయవాల చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రించి రంగులు వేసి ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.
పెద్దమంతూరు క్లస్టర్ పరిధిలోని చిన్నమంతూరు, తిమ్మాపురం, చెరుకూరు, రోప్పాల, శేషాపురం, కలిపి, కలిపి కాలనీ మరియు పెద్దమంతూరు ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి రొద్దం మండల టిడిపి కన్వీనర్ నరహరి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు శ్రీ రామాంజనేయులు హాజరై ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించారు. విచ్చేసిన విద్యార్థులందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ ముజఫర్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సైన్స్ ఉపాధ్యాయులు శ్రీ పుల్లారాయుడు మరియు రాఘవేంద్రలను ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి