Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 12:59 AM

పెద్దకాపర్తి శివారులో రైన్‌బో ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం

పెద్దకాపర్తి శివారులో రైన్‌బో ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం

పెద్దకాపర్తి శివారులో రైన్‌బో ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం
May 30, 2026 06:56 AM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

అప్రమత్తమైన డ్రైవర్, క్లీనర్‌తో 40 మంది ప్రయాణికులు సురక్షితం.. సామాన్లు దగ్ధం.

నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న రైన్‌బో ట్రావెల్స్‌కు చెందిన బస్సు (NL07 B 0886)లో శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు ఇంజిన్ భాగంలో మంటలు ప్రారంభమయ్యాయి. పొగలు, మంటలను గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను బయటకు దింపారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగా బయటపడగా, ప్రయాణికుల సామాన్లు మాత్రం మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తతతో భారీ ప్రాణనష్టం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే ప్రయాణికులు తమ విలువైన సామాన్లు కోల్పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News