Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

పెద్దకాపర్తి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కు డిమాండ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరు గణేష్

పెద్దకాపర్తి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కు డిమాండ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరు గణేష్

పెద్దకాపర్తి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కు డిమాండ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరు గణేష్
January 23, 2026 09:53 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి.

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామపంచాయతీ కార్యదర్శి కంచర్ల గౌతంరెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ డిమాండ్ చేశారు.

గ్రామంలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి రామన్నపేట రోడ్డువరకు ఇరువైపులా 2011 సంవత్సరంలో నాటిన వేప చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తొలగించి ప్రైవేటు వ్యాపారులకు అమ్మేశారని ఆయన ఆరోపించారు. గ్రామానికి నీడనిచ్చే విధంగా, పర్యావరణానికి ఎంతో ఉపయోగకరంగా పెద్ద వృక్షాలుగా ఎదిగిన ఈ చెట్ల విలువ సుమారు రూ.5 లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు.

గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా, ఆర్ అండ్ బి అధికారులు, అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోకుండానే కార్యదర్శి తన సొంత నిర్ణయంతో చెట్లను విక్రయించడం తీవ్రమైన నేరమని గణేష్ మాదిగ అన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన చర్యగా ఆయన విమర్శించారు.

ఒకవైపు ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కల నాటే కార్యక్రమాలు చేపడుతుంటే, ప్రభుత్వ అధికారి హోదాలో ఉండి వ్యక్తిగత లాభం కోసం చెట్లను నరికివేయడం బాధాకరమని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటన వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

ఈ విషయాన్ని ఎమ్మార్పీఎస్ ఇంతటితో వదిలిపెట్టబోదని స్పష్టం చేసిన గణేష్ మాదిగ, అవసరమైతే ఆర్ అండ్ బి అధికారులు, అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. పర్యావరణానికి నష్టం కలిగించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News