పెద్ద కాపర్తిలో తిరుమలనాద స్వామి కళ్యాణం వైభవంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టు వస్త్రాల సమర్పణ
పెద్ద కాపర్తిలో తిరుమలనాద స్వామి కళ్యాణం వైభవంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టు వస్త్రాల సమర్పణ
Komidala Mahender reddy
చిట్యాల: మండలంలోని పెద్ద కాపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూ సమేత తిరుమలనాద స్వామి వారి కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వేముల వీరేశం హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజ ఐక్యతకు ప్రతీకలని పేర్కొన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.కార్యక్రమంలో గుడి చైర్మన్ ఉరుసు రాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, మార్కెట్ చైర్మన్ నర్ర వినోదమోహన్ రెడ్డి, సుంకనపల్లి సర్పంచ్ ఆవుల సునీత, చిన్నకాపురి సర్పంచ్ ఆవుల సుందర్, ఆరెగూడెం సర్పంచ్ శ్యామ్, కమిటీ డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, అరగంటి పూజా, నరేష్, సాగర్ల నవ్య, శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, తెలుసూరి నరసింహ, జిల్లా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి