Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:11 PM

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.

పోస్టల్ బ్యాలెట్ భయం: గ్రామపంచాయతీ ఎన్నికలపై సమగ్ర విచారణ చేయాలి.
December 09, 2025 12:51 PM 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

మాజీ రాష్ట్ర టిడిపి కార్యదర్శి రాపోలు నరసింహా

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో ప్రజల్లో నెలకొంటున్న భయాందోళనలపై ఎన్నికల అధికారులు తక్షణం దృష్టి సారించాలని తెలంగాణ టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహా కోరారు.ప్రతి ఓటరు ప్రజాస్వామ్య నిబంధనలకు అనుగుణంగా గోప్యత, భద్రతతో ఓటు వేయగలగాలి, వారి ఓటు ఎవరికి తెలియకుండా పూర్తి రక్షణ కల్పించడం ఎన్నికల అధికారుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయాల్సిన పరిస్థితుల్లోనూ భయపడుతున్నారని, గ్రామస్థాయిలో పంచాయతీలు లేకపోవడం వంటి సమస్యలు కూడా గంభీరంగా ఉన్నాయని రాపోలు నరసింహా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై సమగ్ర పరిశీలన చేసి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో టిడిపి–టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నకిరేకంటి గణేష్, నాయకులు పోచబోయిన మల్లేశం, కాట్రేగు సంజీవ్, తాటిపాముల రాజు, కట్ట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News