Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:13 PM

పట్టపగలు ఇంటి చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్

పట్టపగలు ఇంటి చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్

పట్టపగలు ఇంటి చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్
February 01, 2026 07:48 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా | జహీరాబాద్ రూరల్ సీఐ పరిధి

తేదీ: 01-02-2026

జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు గారు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ 27-01-2026 నాడు సంగారెడ్డి జిల్లా కలీల్పూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన ఇంటి చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

కలీల్పూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి మరియు సూరప్పలకు చెందిన ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తి బంగారు ఆభరణాలు మరియు కొంత నగదు దొంగలించి పరారైనట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు హద్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది.

జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు గారి ఆదేశాల మేరకు, హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ దోమ సుజిత్ గారు తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టి, కేవలం మూడు రోజుల్లోనే కేసును ఛేదించారు.

తేదీ 01-02-2026 నాడు ఉదయం గంగ్వార్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ఆటో డ్రైవర్ అతివేగంగా వచ్చి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకొని విచారించగా, తాను చోరీ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.

నిందితుడి వద్ద నుండి

రెండున్నర తులాల బంగారు ఆభరణాలు,

రూ.1,000 నగదు,

చోరీకి ఉపయోగించిన ఆటో వాహనం

స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును విజయవంతంగా ఛేదించినందుకు హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ గారితో పాటు సిబ్బంది

సేవాలాల్, అభినేర్, తమ్మాలి రాజశేఖర్, సాయి కిరణ్, మహేష్ బాబు, పాండులను

సీఐ జక్కుల హన్మంతు గారు అభినందించారు.

రిపోర్టర్: సంగమేశ్వర్ రెడ్డి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News