Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:46 PM

పట్టపగలు ఇంటి చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్

పట్టపగలు ఇంటి చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్

పట్టపగలు ఇంటి చోరీ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్
February 01, 2026 07:48 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా | జహీరాబాద్ రూరల్ సీఐ పరిధి

తేదీ: 01-02-2026

జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు గారు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ 27-01-2026 నాడు సంగారెడ్డి జిల్లా కలీల్పూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన ఇంటి చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

కలీల్పూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి మరియు సూరప్పలకు చెందిన ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తి బంగారు ఆభరణాలు మరియు కొంత నగదు దొంగలించి పరారైనట్లు ఫిర్యాదు అందింది. ఈ మేరకు హద్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది.

జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హన్మంతు గారి ఆదేశాల మేరకు, హద్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ దోమ సుజిత్ గారు తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టి, కేవలం మూడు రోజుల్లోనే కేసును ఛేదించారు.

తేదీ 01-02-2026 నాడు ఉదయం గంగ్వార్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక ఆటో డ్రైవర్ అతివేగంగా వచ్చి పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకొని విచారించగా, తాను చోరీ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.

నిందితుడి వద్ద నుండి

రెండున్నర తులాల బంగారు ఆభరణాలు,

రూ.1,000 నగదు,

చోరీకి ఉపయోగించిన ఆటో వాహనం

స్వాధీనం చేసుకొని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసును విజయవంతంగా ఛేదించినందుకు హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ గారితో పాటు సిబ్బంది

సేవాలాల్, అభినేర్, తమ్మాలి రాజశేఖర్, సాయి కిరణ్, మహేష్ బాబు, పాండులను

సీఐ జక్కుల హన్మంతు గారు అభినందించారు.

రిపోర్టర్: సంగమేశ్వర్ రెడ్డి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News