పట్టణ పారిశుధ్యానికి శ్రీకారం చుట్టిన కోదాడ మున్సిపల్ నూతన పాలకవర్గం.....
పట్టణ పారిశుధ్యానికి శ్రీకారం చుట్టిన కోదాడ మున్సిపల్ నూతన పాలకవర్గం.....
Harish HS
పట్టణ పారిశుధ్యానికి శ్రీకారం చుట్టిన కోదాడ మున్సిపల్ నూతన పాలకవర్గం.....
పారిశుద్ధ్యంలో కోదాడ పట్టణాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని కోదాడ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట రత్నం బాబు అన్నారు. ఆదివారం పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులు ప్రారంభించి మాట్లాడారు.పట్టణంలో దోమల నివారణకు ట్రాక్టర్ ట్యాంకర్ ల ద్వారా నివారణ మందును పిచికారి చేయించారు. పట్టణ పారిశుధ్యానికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి సహకారంతో పట్టణంలో పారిశుద్ధ్యం తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. పట్టణ ప్రధాన సమస్యలు డ్రైనేజీలు సిసి రోడ్లు విద్యుత్తు మంచినీరు దోమల ,కుక్కల , కోతుల బెడద నివారణకు చర్యలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు పారిశుధ్యం కి సహకరించాలన్నారు. ఇండ్లలో చెత్తాచెదారం వీధుల్లో వేయకుండా తమ మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. ఎక్కడైనా సిబ్బంది గైర్హాజరైతే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. రానున్న వేసవిలో నీటిని ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాలక వర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి