పటాన్చెరులో మాడిఫైడ్ సైలెన్సర్ల సీజ్ – 7 వాహనదారులకు జరిమానాలు
పటాన్చెరులో మాడిఫైడ్ సైలెన్సర్ల సీజ్ – 7 వాహనదారులకు జరిమానాలు
Krishna
పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అధిక శబ్దాలతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వాహనాలపై పటాన్చెరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా తనిఖీలు చేపట్టి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న 07 మంది వాహనదారులను గుర్తించి మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అలాగే ఆయా వాహనాలకు అమర్చిన మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ మాట్లాడుతూ మాడిఫైడ్ సైలెన్సర్ల వల్ల వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు మరియు సాధారణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనదారులను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి