Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:59 PM

పటాన్‌చెరులో మాడిఫైడ్ సైలెన్సర్ల సీజ్ – 7 వాహనదారులకు జరిమానాలు

పటాన్‌చెరులో మాడిఫైడ్ సైలెన్సర్ల సీజ్ – 7 వాహనదారులకు జరిమానాలు

పటాన్‌చెరులో మాడిఫైడ్ సైలెన్సర్ల సీజ్ – 7 వాహనదారులకు జరిమానాలు
01-05-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అధిక శబ్దాలతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వాహనాలపై పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పటాన్‌చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా తనిఖీలు చేపట్టి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న 07 మంది వాహనదారులను గుర్తించి మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అలాగే ఆయా వాహనాలకు అమర్చిన మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ మాట్లాడుతూ మాడిఫైడ్ సైలెన్సర్ల వల్ల వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు మరియు సాధారణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనదారులను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

Sthanikam

పటాన్‌చెరులో మాడిఫైడ్ సైలెన్సర్ల సీజ్ – 7 వాహనదారులకు జరిమానాలు

Article Image

పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అధిక శబ్దాలతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న మాడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వాహనాలపై పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పటాన్‌చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బందితో కలిసి ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా తనిఖీలు చేపట్టి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న 07 మంది వాహనదారులను గుర్తించి మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. అలాగే ఆయా వాహనాలకు అమర్చిన మాడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అశోక్ మాట్లాడుతూ మాడిఫైడ్ సైలెన్సర్ల వల్ల వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు మరియు సాధారణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనదారులను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News