పసిబిడ్డ మృతికి నిరసనగా జేఏసీ ర్యాలీ.....
పసిబిడ్డ మృతికి నిరసనగా జేఏసీ ర్యాలీ.....
Harish HS
పసిబిడ్డ మృతికి నిరసనగా జేఏసీ ర్యాలీ.....
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో బీసీ చాకలి కులస్తులపై జరిగిన దాడిని ఖండిస్తూ కోదాడలో బీసీ,ఎస్సీ, ఎస్టీ,జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తల్లి, కొడుకు, కోడలిపై దాడి చేసి రెండు నెలల పసిబిడ్డ మృతికి కారణమైన నిందితులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐను వెంటనే తొలగించాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం పట్టణ నాయకులు నాగేశ్వరరావు,ఎల్లయ్య, నాగేందర్,ఆదిలక్ష్మి,సురేష్ లింగయ్య,సతీష్, శ్రీను,శేఖర్ కృష్ణయ్య, యాదగిరి,స్వామి, భూమా శ్రీనివాస్,ఆతుకూరి భాస్కర్, కర్ల శివ,ఏర్పుల శ్రవణ్, కరుణాకర్, బిజెపి నాయకులు పారెల్లి మహేష్, కర్ల ప్రేమానంద్ తదితరులు పాల్గొన్నారు......
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి