PRINT TIME: May 27, 2026 03:02 AM
పరుగుతో ఫిట్నెస్కు పదును ఎస్పీఎఫ్ సిబ్బంది 10 కిమీ రన్
పరుగుతో ఫిట్నెస్కు పదును ఎస్పీఎఫ్ సిబ్బంది 10 కిమీ రన్
March 24, 2026 04:04 PM
47 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
టీజీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లాక్రా ఆదేశాలు, కమాండెంట్ ఎన్. త్రినాధ్ సూచనల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా ఎస్పీఎఫ్ సిబ్బందికి మంగళవారం ఉదయం 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు సాగిన ఈ పరుగులో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందించడం, భక్తులకు మెరుగైన భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ కె. శేషగిరిరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి