టీజీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లాక్రా ఆదేశాలు, కమాండెంట్ ఎన్. త్రినాధ్ సూచనల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా ఎస్పీఎఫ్ సిబ్బందికి మంగళవారం ఉదయం 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు సాగిన ఈ పరుగులో అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందించడం, భక్తులకు మెరుగైన భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ కె. శేషగిరిరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవి, ఏఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి