Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పద్మావతి నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ శంకుస్థాపన డిజిటల్ దిశగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అడుగు: డిజిటల్ లైబ్రరీ ప్రారంభం 15 వేల కేసులు 10 నెలల్లో: పెనాల్టీ ఎంత… న్యాయం ఎంత? రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 29, 2026 09:08 PM

పారిశ్రామిక అనుమతులకు వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

పారిశ్రామిక అనుమతులకు వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

పారిశ్రామిక అనుమతులకు వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
April 29, 2026 07:55 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న పారిశ్రామిక అనుమతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై చర్చించి పరిశ్రమలకు అవసరమైన బొగ్గు, ఇంధన ముడి పదార్థాల కేటాయింపుపై సమీక్ష నిర్వహించి ఒక దరఖాస్తుకు అనుమతి మంజూరు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకం కింద ఐదు దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని, పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, పరిశ్రమల శాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News