పారిశ్రామిక అనుమతులకు వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
పారిశ్రామిక అనుమతులకు వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
Krishna
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత వేగం తీసుకురావాలని, పెండింగ్లో ఉన్న పారిశ్రామిక అనుమతి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై చర్చించి పరిశ్రమలకు అవసరమైన బొగ్గు, ఇంధన ముడి పదార్థాల కేటాయింపుపై సమీక్ష నిర్వహించి ఒక దరఖాస్తుకు అనుమతి మంజూరు చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకం కింద ఐదు దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించాలని, పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, పరిశ్రమల శాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి