పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసిన వాణి ప్రసాద్
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై పరస్పరం చర్చించారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, సదుపాయాల విస్తరణ, దేశీయ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధానాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి