Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:19 PM

ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ లో ఘనంగా అమ్మకు వందనం.

ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ లో ఘనంగా అమ్మకు వందనం.

ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ లో ఘనంగా అమ్మకు వందనం.
April 07, 2026 06:57 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ లో ఘనంగా అమ్మకు వందనం.

విద్యార్థు ల్లో తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం విశ్రాంత ఉపన్యాసకులు సాహితీవేత్త శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు. సోమవారం కోదాడ పట్టణంలోని నయా నగర్ ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ హైస్కూల్ లో సోమవారం అమ్మకు వందనం కార్యక్రమం సందర్భంగా పాఠశాల చైర్మన్ యం.డి షేర్ అలీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ. విద్యార్థుల్లో తల్లిదండ్రుల గొప్పతనాన్ని తెలిపే అమ్మ కు వందనం కార్య క్రమం నిర్వహించడం అభినందనీయం అన్నారు. నైతిక విలువలకు పునాది పాఠశాల అని , నైతిక విలువలు విద్యార్ధుల్లో పెంపొందించేందు కు ప్రతిభ బ్లూమ్ ఇన్నోవేటివ్ స్కూల్ చేస్తున్న కృషి ప్రశంస నీయం అన్నారు. ఒక మంచి తల్లి వంద మంది ఉపాధ్యాయుల తో సమానం అన్నారు.తల్లి దండ్రులు దైవం తో సమానం అన్నారు. మరో ముఖ్య అతిథి రచయిత సంఘం అధ్యక్షుడు పుప్పాల కృష్ణ మూర్తి మాట్లాడుతూ అమ్మ విలువ అందనంత దూరంలో వున్నప్పుడే అర్ధం అవుతుందన్నారు. తల్లి దండ్రుల ను మరవద్దన్నారు. తల్లి దండ్రుల ను చూసే బాధ్యత పిల్లల దే అన్నారు. తల్లి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేని దన్నారు. అనంతరం తల్లి దండ్రులకు విద్యార్ధులు పాద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణ గూడెం హై స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సత్తార్, పీఎం శ్రీ జిల్లా పరిషత్ స్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు శ్రీమతి షేక్ రెహానా బేగం విద్యార్ధుల తల్లి దండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News