Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

ప్రాంతీయ పశువైద్యశాలకి బహుళార్థక ఎండోస్కోప్ పంపిణీ

ప్రాంతీయ పశువైద్యశాలకి బహుళార్థక ఎండోస్కోప్ పంపిణీ

ప్రాంతీయ పశువైద్యశాలకి బహుళార్థక ఎండోస్కోప్ పంపిణీ
February 24, 2026 06:51 PM 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఆధునిక సాంకేతిక యంత్రాలతో ఇంకా మెరుగైన పశువైద్య సేవలు

- డా. పి.పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్

మారుతున్న కాలానుగుణ అవసరాల కనుకూలంగా మారుమూల గ్రామాల్లో జంతువైద్యంలో సైతం శాస్త్రీయ పద్ధతిలో వ్యాధి నిర్ధారణ చేయడానికి బహుళార్డ ఎండోస్కోప్ లు ఎంతో ఉపయోగపడతాయని అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు .

జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి డా.డి.శ్రీనివాసరావు చేతుల మీదుగా సూర్యాపేట లో బహుళార్డ ఎండోస్కోప్ స్వీకరించిన సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ పాడి పశువుల్లో అతిగా ఇబ్బంది పెట్టే గర్భధారణ సమస్యలు పరిష్కరించడానికి ఈ ఎండీస్కాప్ పరికరం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఒక పశువు సమస్యలను అధిగమించి ఒక నెలరోజుల ముందు సూడి మోసినా నెలకి పదివేల రూపాయల అదనపు ఆదాయం రైతుకి లభిస్తుందని, అదే పట్టణంలో ఉన్న 5 వేల పశువుల్లో ఈ యంత్రం వాడకం ద్వారా సకాలంలో రెండు వేల పశువులు ఒక్క నెల ముందు సూడి మోసినా నెలకి రెండు కోట్ల అదనపు సంపద వస్తుందని తెలిపారు.

కుక్కలు, పిల్లులు,గొర్రెలు మేకలు ఆవులు గేదెల్లో గొంతు లో మేత కానీ ఇతర పదార్ధాలు అడ్డు పడినప్పుడు, గొంతు సమస్యలను గుర్తించడానికి ఈ ఎండోస్కోప్ ఎంతో ఉపకరిస్తుందని ఈ పరికరం సహాయం తో గొంతులో అడ్డుగా ఉన్న వాటిని గుర్తించి సత్వరమే శస్త్ర చికిత్సతో తొలగించి జంతువుల ప్రాణాలను కాపాడడానికి ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు.

ఈ బహుళార్థక ఎండోస్కోప్ , మరియు మొబైల్ మానిటరింగ్ గల కిట్స్ జిల్లాలోని అన్ని పశువైద్య శాలల్లో కూడా పంపిణీ చేయడం జరుగుతుందని , పశుపోషకులకు ఇకనుండి మెరుగైన వ్యాధినిర్ధారణతో సమర్థ వైద్యసేవలు అందిస్తామని తెలిపారు

ఎండోస్కాప్ పంపిణీ కార్యక్రమములో జిల్లా కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ డా బి వెంకన్న, తుంగతుర్తి, నేరేడుచర్ల అసిస్టెంట్ డైరెక్టర్ లు డా సత్యనారాయణ, బి. రవిప్రసాద్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News