Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బక్రీద్ వేళ మానవత్వాన్ని చాటిన:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:33 PM

పార్టీ బలోపేతానికి నాయకులు సమిష్టిగా కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి నాయకులు సమిష్టిగా కృషి చేయాలి

పార్టీ బలోపేతానికి నాయకులు సమిష్టిగా కృషి చేయాలి
May 27, 2026 05:19 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అన్ని మండలాల నాయకులతో విస్తృత స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత, మహిళలు, కొత్త ఓటర్లను అధిక సంఖ్యలో పార్టీలో చేర్చుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ ఆన్‌లైన్ విధానంలో కూడా నమోదు చేసే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి నాయకుడికి సభ్యత్వ నమోదు లక్ష్యాలు కేటాయించి గ్రామ, బూత్ స్థాయిలో పార్టీ కమిటీలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వడం, సభ్యత్వ నమోదు పనితీరు ఆధారంగా భవిష్యత్ బాధ్యతలు అప్పగించడం, కార్యకర్తల సంక్షేమం కోసం బీమా వంటి పథకాలపై కూడా సమావేశంలో చర్చించారు. పార్టీని మళ్లీ ప్రజల్లో బలంగా నిలబెట్టేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని నాయకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అనుముల మారుతి, ప్రభాకర్, గంగారం, పండరి యాదవ్, అంజయ్య సాగర్, విజయ్, కృష్ణారెడ్డి, శంకర్ సాగర్, నారాయణ సాగర్, బసవరాజు పటేల్, సంగారెడ్డి, కర్ణం రాజు, నరసింహులు, ఆకుల రాములు, రామాగౌడ్, ప్రహ్లాద్, సంతోష్ పటేల్, సాయిలు, సందీప్, నమిల్ల హన్మండ్లు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News