పార్టీ బలోపేతానికి నాయకులు సమిష్టిగా కృషి చేయాలి
పార్టీ బలోపేతానికి నాయకులు సమిష్టిగా కృషి చేయాలి
Krishna
నారాయణఖేడ్ పట్టణంలో జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అన్ని మండలాల నాయకులతో విస్తృత స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత, మహిళలు, కొత్త ఓటర్లను అధిక సంఖ్యలో పార్టీలో చేర్చుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ ఆన్లైన్ విధానంలో కూడా నమోదు చేసే ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి నాయకుడికి సభ్యత్వ నమోదు లక్ష్యాలు కేటాయించి గ్రామ, బూత్ స్థాయిలో పార్టీ కమిటీలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వడం, సభ్యత్వ నమోదు పనితీరు ఆధారంగా భవిష్యత్ బాధ్యతలు అప్పగించడం, కార్యకర్తల సంక్షేమం కోసం బీమా వంటి పథకాలపై కూడా సమావేశంలో చర్చించారు. పార్టీని మళ్లీ ప్రజల్లో బలంగా నిలబెట్టేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని నాయకులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అనుముల మారుతి, ప్రభాకర్, గంగారం, పండరి యాదవ్, అంజయ్య సాగర్, విజయ్, కృష్ణారెడ్డి, శంకర్ సాగర్, నారాయణ సాగర్, బసవరాజు పటేల్, సంగారెడ్డి, కర్ణం రాజు, నరసింహులు, ఆకుల రాములు, రామాగౌడ్, ప్రహ్లాద్, సంతోష్ పటేల్, సాయిలు, సందీప్, నమిల్ల హన్మండ్లు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి