Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:07 AM

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
26-02-2026 155 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదలుకాగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఆదర్శ కళాశాల, శ్రీ గాయత్రి కళాశాల, ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాల, టీజీ ఆర్ఎస్ జూనియర్ కళాశాలలను అధికారులు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు.కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేస్తున్నట్లు సమాచారం. చౌటుప్పల్‌లోని ఐదు కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 1159 మంది విద్యార్థులు నమోదు కాగా, అందులో 1125 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు.

Sthanikam

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Article Image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మొదలుకాగా, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి.

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఆదర్శ కళాశాల, శ్రీ గాయత్రి కళాశాల, ప్రతిభ ఒకేషనల్ జూనియర్ కళాశాల, టీజీ ఆర్ఎస్ జూనియర్ కళాశాలలను అధికారులు కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు.కేంద్రాల్లో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేస్తున్నట్లు సమాచారం. చౌటుప్పల్‌లోని ఐదు కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 1159 మంది విద్యార్థులు నమోదు కాగా, అందులో 1125 మంది హాజరై పరీక్ష రాశారు. 34 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News