ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
Editor Desk
ఆత్మకూరు,
పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సదుపాయం, మౌలిక వసతులు, ఆరోగ్య శిబిరం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లావణ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి