Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టాలెంట్ టెస్ట్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థికి రూ.4 లక్షల ప్రోత్సాహక బహుమతి సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల తీర్పు: మత మార్పిడికి అడ్డుకట్ట.. రాజ్యాంగ సవరణ డిమాండ్ గర్జింపు! “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 28, 2026 05:34 PM

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు.   పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
March 28, 2026 03:42 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మకూరు,

పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సదుపాయం, మౌలిక వసతులు, ఆరోగ్య శిబిరం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లావణ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News