Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:34 AM

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు.   పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి
28-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మకూరు,

పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సదుపాయం, మౌలిక వసతులు, ఆరోగ్య శిబిరం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లావణ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు. పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

ఆత్మకూరు,

పదో తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.

పరీక్షా కేంద్రంలో సీసీ టీవీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, తాగునీటి సదుపాయం, మౌలిక వసతులు, ఆరోగ్య శిబిరం వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాలను పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లావణ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News